రొయ్యల నిల్వ పచ్చడి తయారీ విధానం :

రుచులు

రొయ్యల పచ్చడి తయారికి కావలసిన పదార్థాలు :

  • పచ్చి రొయ్యలు : 500గ్రాములు
  • అల్లం వెల్లులి పేస్టు : 5 స్పూన్స్
  • కారం:100గ్రాములు
  • ఉప్పు తిగినంత
  • పసుపు :1/2 స్పూన్
  • మెంతుల పౌడర్ : 2స్పూన్స్
  • గరం మసాలా : 1స్పూన్
  • నూనె : 250 ఎం.ల్
  • నిమ్మ రసం :5 స్పూన్స్
  • పోపు దినుసులు తగినన్ని
  • కరివేపాకు
  • పొట్టు తీసిన వెల్లులి రిబ్బలు

తయారు చేయు విధానం :

  • ముందుగా పచ్చి రోయాలను శుబ్రంగా చేసుకొని పక్కనపెట్టాలి.
  • స్టవ్ ఫై కడాయ్ పెట్టి నూనె పోసి వేడయ్యాక పచ్చి రొయ్యలను నూనెలొ వేసి బాగా వేగనివ్వాలి.  కడాయ్ లో నీరు ఏమాత్రము లేకుండా రొయ్యలను వేగానిస్తూ కాస్త పసుపు వేయాలి. రొయ్యలు దగ్గరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి.
  • కడాయి లో మిగిలిన నూనెను గోరువెచ్చగా చేసి అల్లం వెల్లులి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, మెంతి పొడి  వేసి కలిపాక చివరగా వేయించిన రొయ్యలను వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • కడాయి లో పోపుకి తగినంత నూనె పోసి వెల్లులి, పోపు దినుసులు , కరివేపాకు వేసి పోపు చేసి ఆ పోపును కలుపుకున్న రొయ్యల మిశ్రమంలో వెయ్యాలి.  ఈ పచ్చడి అంతా చల్లారక నిమ్మ రసం పొయ్యాలి.
  • ఈ రొయ్యల పచ్చడి సుమారుగా నెల పాటు నిల్వ ఉంటుంది.

 

 

Leave a Reply