Rajeev Kumar Election Commissioner

భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

జాతీయం

డిల్లీ, సెప్టెంబర్ 1:  ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా మాజీ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ జార్ఖండ్ కేడర్ కు చెందినవారు. 30 ఏళ్లకు పైగా పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన పబ్లిక్ ఎంటర్‌ప్రై‌జెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. గత నెల 31వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. దీంతో ఆయన మంగళవారం ఎన్నికల కమిషనర్ గా బాద్యతలు చేట్టారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన పని చేయనున్నారు.

సీఈసీగా అశోక్ లావాస గత నెల 18న రాజీనామా చేశారు. అనంతరం రాజీవ్ కుమార్ ను నూతన చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఎన్నికల కమిషనర్ గా బాద్యతలు చేట్టారు.

 

Leave a Reply