property registration

రేపటి నుంచి తెలంగాణాలో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు రద్దు

తెలంగాణ

హైదరాబాద్, సెప్టెంబర్ 7:  సెప్టెంబరు 8 నుండి తెలంగాణలో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగవని, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల విభాగాలను తదుపరి నోటీసు వచ్చే వరకు పనిచేయడం మానేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, చలాన్లు చెల్లించిన వారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. నేటి నుంచి ఈ-స్టాంపులు ఇవ్వడం మానేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్టాంపుల శాఖ కమిషనర్ చిరంజీవులు తెలిపారు. అసెంబ్లీ నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రికి రికార్డులు సమర్పించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా ఎంఆర్‌ఓల కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పునః ప్రారంభంపై ఇంకా ధృవీకరణకు రాలేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త రెవెన్యూ చట్టం కంటే ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టానికి అనుమతి లభించనుంది. గత వారం, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను ఆపాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విభాగాన్ని ఆదేశించింది. భూములను క్రమబద్ధీకరించడానికి జీవోను జారీ చేసింది.

గ్రామ పంచాయతీల నుండి రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు ఎల్‌ఆర్‌ఎస్ (లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ )‌ను అమలు చేసే జిఓను ప్రభుత్వం ఆమోదించింది.

 

Leave a Reply