Actor Jayaprakash Reddy

జయప్రకాశ్ రెడ్డి మృతి : దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్, టాలీవుడ్

గుంటూరు, సెప్టెంబర్ 8:  తెలుగు నటుడు జయ ప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 74. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్రూములో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినీమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.

రెడ్డి తన 40 ఏళ్ళ వయసులో వెండితెరపైకి ప్రవేశించాడు. అతను వెంకటేష్ యొక్క 1988 చిత్రం బ్రహ్మ పుత్రుడులో అతను పోలీసుల ఇన్స్పెక్టర్గా నటించే అవకాశం వచ్చింది. ప్రేమించుకుందా రా సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు జయప్రకాష్. ఆ సినిమాలో ఆయన నటన, రాయలసీమ యాసలో డైలాగ్ తీరు ఎంతో ఆకట్టుకుంది. బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమర సింహా రెడ్డి సినిమాలో మరో సారి రాయలసీమ యాసలో మాట్లాడుతూ విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డ్ వచ్చింది

ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని, నాగార్జున వంటి స్టార్స్ నివాళ్లు అర్పించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి జై ప్రకాష్ రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. ఆయనతో కలిసి తాను చివరిసారిగా ‘ఖైదీ నెంబర్ 150’లో నటించానని తెలిపారు. తన కన్నతల్లి నాటరంగం, తనను పెంచిన తల్లి సినీరంగం అని జయప్రకాశ్ రెడ్డి అంటుండేవారని గుర్తుచేసుకున్నారు. నాటకరంగంపై ఆయనకు ఎంతో ప్రేమ అని అన్నారు.

 

Leave a Reply